టూరిజంలో ప్రైవేట్ సంస్థలకి సగం వడ్డీ రేటుకే భారీగా రుణాలు, రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ. 200 కోట్లు : ఏపీ మంత్రి

|

Dec 19, 2020 | 2:24 PM

పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ జీ స్టార్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఏపీ టూరిజం మినిస్టర్..

టూరిజంలో ప్రైవేట్ సంస్థలకి సగం వడ్డీ రేటుకే భారీగా రుణాలు, రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ. 200 కోట్లు :  ఏపీ మంత్రి
Follow us on

పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ జీ స్టార్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్‌ విశాఖలో తెలిపారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు…అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత పాలకులు చూపించినట్లుగా గ్రాఫిక్స్‌ చూపించమన్నారు. టూరిజం రంగానికి కూడా రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ. 200 కోట్లు కేటాయించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ ప్యాకేజీ లో భాగంగా టూరిజం లో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామన్నారు. మొత్తం రుణాలపై 9 శాతం వడ్డీ కాగా, అందులో 4.5 % ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.