ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

|

Sep 13, 2020 | 6:56 PM

ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ అందించింది. ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్  గడువును పొడిగించింది.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
Follow us on

AP Eamcet Hall Tickets: ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ అందించింది. ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్  గడువును పొడిగించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఆయా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఎంసెట్‌కు ఈ నెల 15వ తేదీ వరకు, పీజీసెట్‌కు ఈ నెల 23 వరకు.. అలాగే లాసెట్‌, ఎడ్‌ సెట్‌, ఏపీపీఈసెట్ లేట్ ఫీజు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు అధికారులు పొడిగించారు.

కాగా, ఏపీలో ఈ నెల 17, 18,21,22,23 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్.. 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాగా, హాల్‌ టికెట్స్‌ కోసం విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ను సందర్శించాలని అధికారులు వెల్లడించారు.