ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

|

Sep 04, 2020 | 7:07 AM

ఎల్​ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​
Follow us on

ఎల్​ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రిత్వ శాఖ, ​​సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన హైలెవ‌ల్ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఎస్ఎస్​బీకి చెందిన పలు ఆర్మీ టీమ్స్‌ను అరుణాచల్​ ప్రదేశ్​, భారత్​-నేపాల్​ బోర్డ‌ర్ ఏరియాల‌కు తరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అత్యంత కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్​, సిక్కింలో భారత్-చైనా-టిబెట్​ కలిసే ట్రై-జంక్షన్​ బోర్డ‌ర్‌లో చైనా దూకుడు చ‌ర్య‌ల‌కు పూనుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హోం శాఖ‌కు స‌మాచారం అందింది. చైనా బోర్డ‌ర్స్‌లో పారా మిలటరీ దళాలు భద్రతను ప‌టిష్ఠం చేశాయి. అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, లద్దాఖ్​, సిక్కిం బోర్డ‌ర్స్‌లోనూ హైఅలర్ట్​ ప్రకటించారు. సిక్కిం, ఉత్తరాఖండ్ ట్రై-జంక్షన్​ ఏరియాల‌కు 80 సైనిక బలగాలను పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్​ఓసీ వెంబడి భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే లేహ్‌లో పర్యటిస్తున్నారు.

Also Read : నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే, రష్యాలో రక్షణ మంత్రి