రైల్వే ఫ్లాట్ ఫాం అమెకు ఆపరేషన్ థియేటర్ అయ్యింది..
భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసింది.
త్రీ ఈడియట్స్ సినిమాలోని సీన్ లాగా నిజ జీవితంలో రిఫిట్ అయ్యింది. ఆ చిత్రంలో ఒక నటుడు వాక్యూమ్ ప్రెజర్ ద్వారా గర్భిణికి డెలివరీచేసే సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ వర్షం కురుస్తుండగా, మరో మార్గంలేని సమయంలో ఆ నటుడు తన స్నేహితుల సాయంతో ఆ గర్భిణికి సురక్షితంగా పురుడుపోస్తాడు. ఇటువంటి ఘటనే యూపీలోని ఝాన్సీ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసింది.
మధ్యప్రదేశ్లోని రావత్పురా జిల్లా బింద్లో నివసిస్తున్న బాద్షా, గోవా ఎక్స్ప్రెస్లో తన భార్య పూజ (19) తో కలిసి దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. ఇంతలో పూజకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఎస్ఐ రాజకుమారి గుర్జర్ తన స్నేహితురాలైన డాక్టర్ డాక్టర్ నీలు కసోటియాకు ఫోను చేశారు. రైల్వే ఫ్లాట్ ఫామే అమెకు ఆపరేషన్ థియేటర్ అయ్యింది. ఆ వైద్యురాలు ఫోనులో సూచనలు చేస్తుండగా, ఎస్ఐ రాజకుమారి ఆ గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు. వెంటనే అంబులెన్స్ను పిలిపించి తల్లీబిడ్డలను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలు ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్నవారంతా ఆ మహిళా ఎస్ఐని అభినందనలతో ముంచెత్తుతున్నారు.