వైసీపీ నాయకుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
హిందూపురం పట్టణంలోని రహమత్ పురానాకి చెందిన వైసీపీ నాయకుడు జబిఉల్లాపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కాగా ఈ దాడిలో జబీఉల్లా తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వానికి..
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్ పురానాకి చెందిన వైసీపీ నాయకుడు జబిఉల్లాపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కాగా ఈ దాడిలో జబీఉల్లా తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వానికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ మేరకు వైసీపీ నాయకుడు జబీ ఉల్లా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడింది సొంత చిన్నాన్న కొడుకుగా గుర్తించారు. వీరి కుటుంబంలోని పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read More:
బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్
మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి