‘లోకనాయకుడు’తో జత కట్టబోతున్న ‘మహానటి’..!
ఓ వైపు యంగ్ హీరోలతో జత కడుతూనే మరోవైపు సీనియర్ హీరోలను చుట్టేస్తోంది 'మహానటి' కీర్తి సురేష్. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్ 'అన్నాత్తే'లో, మోహన్ లాల్ 'మరాక్కర్' మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది కీర్తి.
ఓ వైపు యంగ్ హీరోలతో జత కడుతూనే మరోవైపు సీనియర్ హీరోలను చుట్టేస్తోంది ‘మహానటి’ కీర్తి సురేష్. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్ ‘అన్నాత్తే’లో, మోహన్ లాల్ ‘మరాక్కర్’ మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది కీర్తి. తెలుగులో నాగార్జున ‘మన్మథుడు 2’లోనూ అతిథి పాత్రలో మెరిసింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ లోక నాయకుడు కమల్ హాసన్తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, కమల్ హాసన్తో ‘వట్టైయాడు విలయాడు’ సీక్వెల్ను తెరకెక్కించాలనుకుంటున్నారు.
ఇందులో మొదట హీరోయిన్గా అనుష్క పేరు వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ స్థానాన్ని కీర్తి రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు కమల్ హాసన్. ఈ మూవీ తరువాత ‘తలైవాన్ ఇరుక్కిన్రన్’లో నటించనున్నారు. అలాగే రజనీకాంత్ నటిస్తోన్న ‘తలైవార్ 169’లోనూ కమల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. మరోవైపు కీర్తి సురేష్ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.