నటుడిగా మారిన సంచలన దర్శకుడు.. హీరోయిన్గా కీర్తి
మహానటి కీర్తి సురేష్ తమిళ్లో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో 'సానీ కాయితమ్' అనే చిత్రంలో కీర్తి నటించనుంది.
Keerthy Suresh next film: మహానటి కీర్తి సురేష్ తమిళ్లో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ‘సానీ కాయితమ్’ అనే చిత్రంలో కీర్తి నటించనుంది. ఇక ఈ మూవీ కోసం నటుడిగా మారారు సంచలన దర్శకుడు, ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్లుక్ తాజాగా విడుదల అయ్యింది. అందులో వీరిద్దరు గ్రామీణ లుక్లో కనిపిస్తుండగా.. కీర్తి చేతిలో గన్, సెల్వ చేతిలో కత్తి ఉంది. వీరి ముందు ఓ వాహనం రక్తంతో నిండి ఉండగా, ఆ వెనుకాల మరికొంత మంది ఉన్నారు. చూస్తుంటే ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక 1980లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్క్రీన్ సీన్ నిర్మించనుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నటించిన గుడ్లక్ సఖి టీజర్ శనివారం విడుదల అవ్వగా.. అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Read More:
ఆటలోనే కాదు మాటల్లోనూ మంత్రముంది
రూ.4.60 కోట్లకు అమ్ముడుపోయిన మైఖేల్ ‘బూట్లు’…
I am very happy to join hands with the next happening director @arunmatheswaran and super excited to share the screen space with namma director @selvaraghavan sir! Thank you @Screensceneoffl ???@yaminiyag @ramu_thangaraj @Inagseditor @kabilanchelliah @sidd_rao #SaaniKaayidham pic.twitter.com/yOFd1LqQlx
— Keerthy Suresh (@KeerthyOfficial) August 15, 2020