‘కరణం మల్లీశ్వరి’ డైరెక్టర్కి అస్వస్థత.. నిర్మాత క్లారిటీ..!
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ను ప్రకటించి హాట్టాపిక్గా మారారు లేడి దర్శకురాలు సంజనా రెడ్డి.
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ను ప్రకటించి హాట్టాపిక్గా మారారు లేడి దర్శకురాలు సంజనా రెడ్డి. రాజ్ తరుణ్ నటించిన ‘రాజు గాడు’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకురాలు ఇప్పుడు కరణం మల్లీశ్వరి బయోపిక్ను తెరకెక్కిస్తుండటంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఇటీవల ఈ దర్శకురాలు తీవ్ర అస్వస్థతకు గురైందని, దాంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంట్లో ఒంటరిగా ఉంటోన్న ఈ దర్శకురాలు ఉన్నట్లుండి పడిపోయిందట. వెంటనే ఆమె పెంచుకుంటున్న కుక్క అరవడంతో.. అక్కడకు చేరుకున్న వాచ్మెన్ సంజనాను ఆసుపత్రికి తరలించారట. ఆ తరువాత ఈ విషయంపై ఆమె సన్నిహితులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె పరిస్థితి మెరుగుపడిందట. ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారట. దీంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా సంజనా స్ట్రిక్ట్ డైట్లో ఉందని.. అందు వలన శరీరంలో గ్లూకోజ్ తగ్గిందని, అందుకే ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలన్నింటికి తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు. సంజనా రెడ్డి కోలుకున్నారని, మరో రెండు రోజులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోనున్నారని ఆయన అన్నారు. ఆమెకు వైరల్ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టతను ఇచ్చారు.
Read This Story Also: 32 మంది రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు