ఈవీఎంలలో రష్యన్ చిప్స్ అమర్చారు: కేఏ పాల్
ఈవీఎంల మొరాయింపు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేఏ పాల్. నర్సాపురంలో తనకు 60 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఐనా అక్కడ వైసీపీనే గెలుస్తుందన్నారు పాల్. జగన్కు ఓటు పడేలా ఈవీఎంలలో చిప్ పెట్టారని ఆరోపించారాయన. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి ప్రధాని మోదీ ఈవీఎంలలో చిప్ పెట్టించారన్నారు. రష్యన్ సాఫ్ట్వేర్తో ఈవీఎంలను కంట్రోల్ చేశారని సంచలన కామెంట్స్ చేశారాయన. ఈ విషయంలో చంద్రబాబుకు ఇప్పుడు కనువిప్పయిందన్నారు పాల్. ఈవీఎంల విషయంలో జరిగిన అక్రమాలకు నిరసనగా తాను […]
ఈవీఎంల మొరాయింపు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేఏ పాల్. నర్సాపురంలో తనకు 60 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఐనా అక్కడ వైసీపీనే గెలుస్తుందన్నారు పాల్. జగన్కు ఓటు పడేలా ఈవీఎంలలో చిప్ పెట్టారని ఆరోపించారాయన. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి ప్రధాని మోదీ ఈవీఎంలలో చిప్ పెట్టించారన్నారు. రష్యన్ సాఫ్ట్వేర్తో ఈవీఎంలను కంట్రోల్ చేశారని సంచలన కామెంట్స్ చేశారాయన. ఈ విషయంలో చంద్రబాబుకు ఇప్పుడు కనువిప్పయిందన్నారు పాల్.
ఈవీఎంల విషయంలో జరిగిన అక్రమాలకు నిరసనగా తాను నిరాహారదీక్ష చేపడుతానన్నారు కేఏ పాల్. యువత పెద్ద సంఖ్యలో తనకు మద్దతుగా తరలి వస్తేనే.. తాను దీక్ష చేపడుతానని కండీషన్ పెట్టారు కేఏ పాల్. జగన్.. మోదీ చేతిలో పావు కాబోతున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో జయలలిత విషయంలో ఏం జరిగిందో జగన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారాయన. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. హెలికాఫ్టర్ గుర్తుకు ఓటు వేస్తే.. ఫ్యాన్ గుర్తుకు పడిందని ఆరోపించారు. నరసాపురంలో మళ్లీ రీ పోలింగ్ నిర్వహించాలన్నారు కేఏ పాల్.