నాగార్జున సాగర్ బైపోల్: ఆ వార్తల్లో నిజం లేదు.. జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి ప్రెస్ నోట్
నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి...
నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడిపై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ నేతలు రఘువీర్ తో సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయా కథనాలపై రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. జానా రెడ్డి కుమారుడిగా తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని, తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వీటిని ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.