Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్ఎం అలోక్ తివారి పేర్కొన్నారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య 123 కిలో మీటర్లు, ధర్మవరం-పాకాల...

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 18, 2020 | 12:19 PM

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్ఎం అలోక్ తివారి పేర్కొన్నారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య 123 కిలో మీటర్లు, ధర్మవరం-పాకాల మధ్య 227 కిలో మీటర్ల విద్యుద్దీకరణ పనులను 2021 వరకూ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి-ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నిల్ వ్యవస్థను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇక అలాగే మిషన్ రఫ్తార్లో భాగంగా గుత్తి-రేణుగుంట మధ్యలో 130 కి.మీ వేగంతో రైలు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ స్పీడ్ ట్రయల్ రన్‌ను సీఓసీఆర్ ద్వారా ఈ రైలు మార్గంలో ట్రాక్ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి-వాడీ మధ్య ట్రాక్ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్ నాటికి ఈ మార్గంలో కూడా 130 కిమీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పతిని కోవిడ్ కేర్ సెంటర్గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read:

సినీ న‌టి మాధ‌విల‌త‌పై కేసు న‌మోదు

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం