IT Raids in AP: వైసీపీ జప్ఫాలు అంటూ.. ఐటీ దాడులపై టీడీపీ నేతల ఫైర్..!
IT Raids in AP: ఏపీలో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ దాడులను చంద్రబాబుకు, టీడీపీకి అంటకట్టడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులను టీడీపీకి సంబంధం ఉందని వైసీపీ జప్ఫాలు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. జగన్పై అప్పట్లో వైఎస్ఆర్ […]
IT Raids in AP: ఏపీలో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ దాడులను చంద్రబాబుకు, టీడీపీకి అంటకట్టడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులను టీడీపీకి సంబంధం ఉందని వైసీపీ జప్ఫాలు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. జగన్పై అప్పట్లో వైఎస్ఆర్ 26 కమిటీలు వేసినప్పటికీ.. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని బోండా ఉమ అన్నారు.
మరోవైపు పీఏ, పీఎస్లతో పార్టీకి సంబంధం ఏం ఉంటుందని మాజీ మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. పీఎస్ శ్రీనివాస్కు టీడీపీకేం సంబంధమంటూ ప్రశ్నించారు. ఆయనొక ప్రభుత్వ అధికారి మాత్రమేనని.. ఆయనపై జరిగిన దాడులు వ్యక్తిగతమని ఆయన అన్నారు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10 నుంచి 15మంది పీఎస్లు, పీఏలు పని చేశారని యనమల చెప్పుకొచ్చారు. అక్రమాస్తుల కేసుల నుంచి తాను తప్పించుకోవడం.. ఎదుంటివాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్నారని విమర్శించారు.