ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింతగా పెంచుతాం…
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలు శాఖల అధిపతులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలు శాఖల అధిపతులు హాజరయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలను పెంచేందుకు నూతన సంస్కరణలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. నూతన సంస్కరణలతో రాష్ర్ట ప్రయోజనాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్కు ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేపట్టే సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు చేయాలన్నారు మంత్రి.
Minister @KTRTRS held a high level meeting with various Departments/HoDs to discuss the new reforms required to improve the Ease of Doing Business standards in Telangana. pic.twitter.com/z1zc3mzTmt
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 23, 2020
టీఎస్ బీపాస్ చట్టంపై కూడా మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టీఎస్ బీపాస్ అనేది చారిత్రాత్మక చట్టమని పేర్కొన్నారు. చట్టం అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమన్నారు మంత్రి. టీఎస్ బీపాస్ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.