క్షిపణుల వివరాలను యూఎస్‌కు లీక్‌ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష..!

ఇరాన్‌ దేశానికి చెందిన పలు క్షిపణలకు సంబంధించిన వివరాలను అమెరికాకు లీక్‌ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. గతంలో డిఫెన్స్‌ విభాగంలో పనిచేసిన రేజా..

క్షిపణుల వివరాలను యూఎస్‌కు లీక్‌ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష..!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 5:57 AM

ఇరాన్‌ దేశానికి చెందిన పలు క్షిపణలకు సంబంధించిన వివరాలను అమెరికాకు లీక్‌ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. గతంలో డిఫెన్స్‌ విభాగంలో పనిచేసిన రేజా అస్గారీ అనే వ్యక్తి.. ఇరానియన్ మిస్సెల్స్‌ గురించిన వివరాలను తస్కరించి.. యూఎస్‌ గుఢచారి సంస్థలకు అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూఎస్‌లోని సీఐఏ సంస్థకు రేజా అస్టారీ ఇరాన్ క్షిపణుల వివరాలను అమ్మినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో రేజా అస్గారీ దోషిగా తేలాడు. దీంతో ఆయనకు మరణశిక్షను విధించారు. గత వారం రోజుల క్రితమే ఈ శిక్షను కూడా అమలు చేసినట్లు జ్యూడీషియరీ ప్రతినిధి ఘోలంహుస్సేన్ వెల్లడించారు.