దేశంలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 487 మంది మృతి..
గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కి చేరినట్లు...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కి చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ప్రస్తుతం 2,69,789 యాక్టీవ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 4,76,378 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21,129 మంది మృతి చెందారు.
Read More:
కరోనా వైరస్తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం
కరోనాకు చెక్ పెట్టేందుకు తక్కువ ధరకే మరో జనరిక్ మెడిసిన్..