ఉన్నావ్ ఘటన: మరో బీజేపీ నేతపై కేసు నమోదు
ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నంగా భావిస్తున్న కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఈ ఘటనలో తాజాగా మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో బీజేపీ నేత అరుణ్ సింగ్ ఉన్నాడు. ఇతడు ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్న రవీంద్ర సింగ్ బంధువే కాక.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగర్కు అనుచరుడు కావడం గమనర్హం. కాగా రెండేళ్ల నాటి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ఇటీవల ప్రమాదానికి […]
ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నంగా భావిస్తున్న కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఈ ఘటనలో తాజాగా మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో బీజేపీ నేత అరుణ్ సింగ్ ఉన్నాడు. ఇతడు ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్న రవీంద్ర సింగ్ బంధువే కాక.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగర్కు అనుచరుడు కావడం గమనర్హం.
కాగా రెండేళ్ల నాటి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ఇటీవల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇది హత్యాప్రయత్నమేనని కుటుంబసభ్యులు ఆరోపించడంతో దీనిని కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ మొత్తం 25మందిపై కేసు నమోదు చేసింది.