భారత్ VS బంగ్లా మ్యాచ్: ముచ్చటగా ముగ్గురు కీపర్లు
బర్మింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఏడు మ్యాచ్ల్లో 11 పాయింట్లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్లో ఒక క్రేజీ థింగ్ ఉంది. అది ఏంటంటే భారత తరపున ముగ్గురు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ బరిలోకి దిగారు. వారు ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్. […]
బర్మింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఏడు మ్యాచ్ల్లో 11 పాయింట్లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్లో ఒక క్రేజీ థింగ్ ఉంది. అది ఏంటంటే భారత తరపున ముగ్గురు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ బరిలోకి దిగారు. వారు ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్. ఇది చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కేదార్ జాదవ్కి బదులు దినేశ్కార్తీక్ బరిలో దిగగా..శిఖర్ ధావన్, విజయ్ శంకర్లకు గాయాలు కావడంతో రిషబ్ పంత్ గ్రౌండ్లోకి ఎంటరయ్యాడు.