పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అపాచీ..
యుద్ధ రంగంలో ఎంతో ఉపయోగపడే అపాచీ హెలికాప్టర్.. పంజాబ్లోని హోషియార్ పూర్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఈ అపాచీ ఫైటర్ చాపర్.. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయిన గంట సేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కంట్రోల్ ప్యానెలస్ ముందస్తు హెచ్చిరకలతో.. హెలికాప్టర్ను పొలాల్లోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కానీ.. ఎలాంటి నష్టం కానీ జరగలేదు. హెలికాప్టర్లోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. […]
యుద్ధ రంగంలో ఎంతో ఉపయోగపడే అపాచీ హెలికాప్టర్.. పంజాబ్లోని హోషియార్ పూర్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఈ అపాచీ ఫైటర్ చాపర్.. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయిన గంట సేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కంట్రోల్ ప్యానెలస్ ముందస్తు హెచ్చిరకలతో.. హెలికాప్టర్ను పొలాల్లోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కానీ.. ఎలాంటి నష్టం కానీ జరగలేదు. హెలికాప్టర్లోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. అంతేకాదు.. హెలికాప్టర్కు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. హెలికాప్టర్లోని సాంకేతిక లోపాలను సరిచేసి.. ఎయిర్ బేస్కు పంపుతామని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.
కాగా.. భారత వాయు సేనకు చెందిన ఈ అపాచీ హెలికాప్టర్లు గతేడాది సెప్టెంబర్లో పంజాబ్ పఠాన్కోట్కు చేరాయి. మొత్తం 8 అపాచీలను తొలి విడతగా అమెరికా భారత్కు అందించింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన టెక్నాలజీతో పాటు.. మల్టీ సర్వీస్లకు ఉపయోగపడుతుందన్న పేరు ఈ ఏహెచ్-64ఈ అపాచీకి సొంతం. 2015 సెప్టెంబర్లో భారత వైమానిక దళం.. 22 అపాచీ హెలికాప్టర్ల కోసం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ లిమిటెడ్తో అగ్రిమెంట్ చేసుకుంది.