ట్వీట్ చేశాడు.. సమస్యకు పరిష్కారం పొందాడు.. ఈ విద్యార్థి చేసిన పనికి శభాష్ అనాల్సిందే..
సోషల్ మీడియాను కొంత మంది చెడుకు.. మరికొంత మంది మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల చాలావరకు తమ ఇబ్బందుల్ని, సమస్యలను సామాజిక
సోషల్ మీడియాను కొంత మంది చెడుకు.. మరికొంత మంది మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల చాలావరకు తమ ఇబ్బందుల్ని, సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. దీంతో ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం దొరికేస్తుంది. ఇలాగే ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ పాఠశాల విద్యార్థి కూడా తనకు ఏర్పడిన సమస్యను ట్విట్టర్ ద్వారా అధికారులు తెలిపి ఆ ఇబ్బందికి పరిష్కారం పొందాడు.
భువనేశ్వర్కు చెందిన సాయి అన్వేష్ స్థానికంగా ఉన్న ఎంబీఎస్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. అయితే ఆ విద్యార్థి స్కూల్కు 7.30 గంటలకు చేరుకోవాలి. కానీ తను వెళ్ళాల్సిన బస్సు మాత్రం 7.40కి తను ఉండే ప్రాంతానికి వస్తుంది. దీంతో స్కూల్కు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని.. ఇదే విషయాన్ని భువనేశ్వర్ క్యాపిటల్ అర్బన్ రవాణా శాఖకు, సీఆర్యూటీ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుణ్ బాత్రాకు ట్విట్టర్లో ట్యాగ్ చేశాడు.
దీంతో ఆ విద్యార్థి ట్వీ్ట్కు అరుణ్ బాత్రా స్పందిస్తూ.. సాయికి కలిగిన ఇబ్బందిని పరిష్కారిస్తూ.. ఇకనుంచి ఉదయం 7 గంటలకే సాయి ప్రాంతానికి బస్సు వస్తుంది అంటూ రీట్వీట్ చేసాడు. ఆ తర్వాత బస్సు వేళ్ళల్లో మార్పులు చేస్తూ సీఆర్యూటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ తర్వాతి రోజు సాయి ప్రాంతానికి ఉదయం 7 గంటలకే బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన సాయి ఫోటోను.. అరుణ్ ట్వీట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది.
@CRUT_BBSR @arunbothra Respected Sir, I want to state that I am a student of MBS public school, Bhubaneswar. I use Mo Bus as my daily transportation means to go to school. Nowadays the timing of the buses are changed.
— Sai Anwesh Amrutam Pradhan (@AnweshSai) January 8, 2021