టాలీవుడ్ టాప్ హీరోతో జతకట్టనున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్‏లో నిజంగానే మూవీ రాబోతుందా?

కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ మూవి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి గుర్తింపు పొందాడు. దీంతో అతడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ టాప్ హీరోతో జతకట్టనున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్‏లో నిజంగానే మూవీ రాబోతుందా?
Follow us

|

Updated on: Dec 22, 2020 | 7:45 PM

కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ మూవి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి గుర్తింపు పొందాడు. దీంతో అతడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు. అటు కేజీఎఫ్ 2 మూవీని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‏తో సలార్ సినిమా చేస్తున్నట్లుగా ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా తీయబోతున్నట్లుగా అప్పట్లో వార్తాలు వచ్చాయి. అదే సమయంలో ప్రభాస్‏తో సలార్ సినిమా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించి అందరిని షాక్‏కు గురిచేసాడు ఈ హిట్ డైరెక్టర్. తాజాగా ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ పూర్తైయిన వెంటనే ఎన్టీఆర్‏తో కలిసి సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కథ కూడా రెడీ అయిందని, ఈ మూవీకి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‍తో మరో సినిమా నటించనున్నట్లుగా తెలుస్తోంది. మరీ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‏లో సినిమా రాబోతుందా? లేదా ? అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.