
ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాలియో పక్షి జీవన విధానం. ఏ పక్షి అయినా గుడ్లను పొదగడానికి వాటిపై కూర్చుంటుంది. కానీ మాలియో పక్షి అందుకు పూర్తి భిన్నంగా తన గుడ్లను భూమిలో పాతిపెట్టి, వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోతుంది. ఈ అద్భుతమైన పక్షి అగ్నిపర్వతాల దగ్గర ఉండే వేడి ఇసుకలో తన గుడ్లను దాచిపెడుతుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే భూగర్భ వేడితోనే ఈ గుడ్లు పిల్లలుగా రూపాంతరం చెందుతాయి.
మాలియో పక్షి తల మీద ఉండే నల్లటి హెల్మెట్ ఒక హైటెక్ థర్మామీటర్గా పనిచేస్తుంది. ఇది ఇసుకలో ఎంత వేడి ఉందో పక్కాగా కొలవగలదు, తద్వారా గుడ్లకు సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. మాలియో పక్షి గుడ్డు ఒక సాధారణ కోడి గుడ్డు కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. పొదగబడిన తర్వాత, పిల్ల పక్షి రెండు రోజుల పాటు ఇసుకను తవ్వుకుంటూ, ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా భూమి పైకి రావాలి. అగ్నిపర్వతాల సహజ వేడితో ప్రాణం పోసుకుని, పుట్టిన వెంటనే స్వతంత్రంగా జీవన పోరాటం మొదలుపెట్టే ఈ మాలియో పక్షి నిజంగా ప్రకృతిలోని ఒక అద్భుతం.
ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పాము.. కట్లపాము, నాగుపాములను కూడా తినేస్తుంది..