
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీ భోజనం తర్వాత మితమైన వేగంతో నడవడం. చురుకుగా నడవడం లేదా జాగింగ్ చేయడం వల్ల పొత్తికడుపు నొప్పి రావొచ్చు.

ఎక్కువ తిన్న తర్వాత మీకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే, వెంటనే వాకింగ్కు వెళ్లడం మంచిది. నడక వల్ల కడుపు ఉబ్బరం, అతిగా తినడం వంటి సమస్యలను నివారించవచ్చు.

మీ శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభించినప్పుడు, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం మంచిది.

భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటే, అది ఎంతకాలం కొనసాగుతుంది? సాధారణంగా, ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల నడక మీ శరీరానికి సరిపోతుంది.

భోజనం చేసిన తర్వాత ఒక మోస్తరుగా నడవడం వల్ల జీవక్రియ పెరిగి..కేలరీలు బర్న్ అవుతాయి. నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.