
భారతదేశం వంటి సూర్యరశ్మి పుష్కలంగా ఉండే దేశంలో కూడా 70 శాతానికి పైగా పట్టణ నివాసితులు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఏసీ గదుల్లో పని చేయడం, బయటకు వెళ్తే సన్ స్క్రీన్లు వాడటం, కాలుష్యం వంటి కారణాలు మనల్ని ఈ పరిస్థితికి నెట్టాయి. విటమిన్-డి అనేది కేవలం ఎముకల బలానికి మాత్రమే కాదు, మన కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే ‘మైటోకాండ్రియా’ పనితీరుకు కూడా అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపిస్తే మధ్యాహ్నం వేళ ఎందుకు నీరసం వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మధ్యాహ్నం వేళ నీరసానికి 5 ప్రధాన కారణాలు:
ATP ఉత్పత్తి తగ్గడం: మన శరీరంలోని కణాలకు ఇంధనం లాంటి ATPని ఉత్పత్తి చేయడంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు నిరంతరం బలహీనంగా అనిపిస్తాయి.
సెరోటోనిన్ ప్రభావం: విటమిన్-డి మన మూడ్ శక్తిని నియంత్రించే ‘సెరోటోనిన్’ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల మధ్యాహ్నం వేళ నీరసం, నిస్సత్తువ వస్తాయి.
కార్టిసాల్ డిప్: సహజంగానే మధ్యాహ్నం 2-4 గంటల మధ్య శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. విటమిన్-డి తక్కువగా ఉన్నప్పుడు శరీరం ఈ తగ్గుదలని తట్టుకోలేక ‘క్రాష్’ అవుతుంది.
వాపు : విటమిన్-డి లోపం వల్ల శరీరంలో అంతర్గత వాపులు పెరిగి, అది విపరీతమైన నిద్రకు బద్ధకానికి దారితీస్తుంది.
భారీ భోజనం: మన భారతీయ వంటకాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల భోజనం తర్వాత బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగి మళ్ళీ పడిపోతుంది. విటమిన్-డి లోపం ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
పరిష్కారం ఏమిటి?:
వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవడం, మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్నపాటి నడక, ఉదయం ఎండలో కనీసం 15 నిమిషాలు గడపడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పైన పేర్కొన్న లారా కేవలం రెండు వారాల సప్లిమెంట్లతోనే తన పూర్వపు శక్తిని తిరిగి పొందింది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. విటమిన్-డి సప్లిమెంట్లను వాడే ముందు ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని, వైద్యుడి సలహా తీసుకోవాలి.