Memory Power: కళ్లకూ.. జ్ఞాపకశక్తికీ చాలా దగ్గర సంబంధం ఉంది.. ఎలానో తెలుసా?

ళ్ళలో సమస్య ఉంటే, చిత్తవైకల్యం అనగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది. కంటి చూపు తగ్గుతున్న రోగులలో, వారి జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యం తగ్గుతాయి.

Memory Power: కళ్లకూ.. జ్ఞాపకశక్తికీ చాలా దగ్గర సంబంధం ఉంది.. ఎలానో తెలుసా?
Eye Problems Memory Loss

Updated on: Sep 17, 2021 | 9:53 PM

Memory Power: కళ్ళలో సమస్య ఉంటే, చిత్తవైకల్యం అనగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది. కంటి చూపు తగ్గుతున్న రోగులలో, వారి జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యం తగ్గుతాయి. ఈ పరిశోధన నిర్వహించిన చైనాలోని గ్వాంగ్‌డాంగ్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ పరిశోధకులు, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల అనుసంధానం వృద్ధుల జ్ఞాపకశక్తి తగ్గడానికి సంబంధించినదని, అయితే ఇది ఎందుకు అనేది స్పష్టంగా తేలలేదనీ  చెప్పారు.

కంటికి, మెదడుకు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి 12,364 మంది వృద్ధులపై ఇటువంటి పరిశోధన అధ్యయనం చేశారు పరిశోధకులు. ఈ పరిశోధనలో 55 నుండి 73 సంవత్సరాల వయస్సు గల 12,364 మంది పాల్గొన్నారు. వృద్ధాప్య కంటి వ్యాధి జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధన నివేదిక వెల్లడించింది. ఉదాహరణకు, మాక్యులర్ డీజెనరేషన్ ఉన్న రోగులలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 26 శాతం వరకు ఉంది. అదే సమయంలో, కంటిశుక్లం రోగులలో 11 శాతం, మధుమేహం, కంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో 61 శాతం మంది చిత్తవైకల్యం కలిగి ఉంటారు.

కంటి చూపు, చిత్తవైకల్యంపై శాస్త్రవేత్తల తర్కం

పరిశోధకులు అంటున్నారు.. కళ్ళలో సమస్య ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి కోల్పోవడం వెనుక ఖచ్చితమైన కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలియదు. దీని వెనుక ఒక కారణం ఉండవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల కంటి చూపు తగ్గుతుంది. దీని కారణంగా, వారి మెదడులో కార్యకలాపాలు కూడా తగ్గుతాయి. అందుకే వారు స్నేహితులు, కుటుంబ సభ్యుల ముఖాలను సరిగ్గా గుర్తించలేకపోయారు.

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన ఈ పరిశోధన ప్రకారం, యూకేలో ప్రతి సంవత్సరం, 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 50 శాతం మంది కంటిశుక్లంతో బాధపడుతున్నారు.  40 వేల మంది మాక్యులర్ డీజెనరేషన్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు.

డయాబెటిస్.. గుండె ఉన్న రోగులలో ప్రమాదం ఎక్కువ..

పరిశోధకులు కంటిలో ఏవైనా సమస్యలు ఉన్న రోగులు మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా డిప్రెషన్, మరిన్ని సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధకులు అంటున్నారు.

పరిశోధన ప్రకారం, మాక్యులర్ డిజెనరేషన్, కంటిశుక్లం, డయాబెటిస్‌తో సంబంధం ఉన్న కంటి వ్యాధులు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. కళ్ళు, జ్ఞాపకశక్తి మధ్య ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చిత్తవైకల్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి

ప్రపంచవ్యాప్తంగా చిత్తవైకల్యం కేసులు పెరుగుతున్నాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా చిత్తవైకల్యం రోగులు మూడు రెట్లు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అలాంటి రోగుల సంఖ్య 15 కోట్లకు పైగా పెరుగుతుంది. తూర్పు, ఉప-సహారా ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో దీని కేసులు చాలా వరకు పెరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి సంవత్సరం 10 మిలియన్ల కొత్త చిత్తవైకల్యం కేసులు ఉన్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల కొత్త పరిశోధన ప్రకారం, 2050 నాటికి, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, దాని 60.2 మిలియన్ కేసుల పెరుగుదలని కూడా ఆపవచ్చు. కేసులు పెరగకుండా నిరోధించడానికి కొత్త వ్యూహాలను రూపొందించడానికి విధాన రూపకర్తలకు ఈ పరిశోధన ఫలితాలు సహాయపడతాయి.

2019 లో చిత్తవైకల్యం రోగుల సంఖ్య 50 మిలియన్లకు పైగా ఉంది. రాబోయే మూడు దశాబ్దాల తరువాత, ఈ సంఖ్య 150 మిలియన్లకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

Vaccine Fake Certificate: టెలిగ్రాం వేదికగా నకిలీ కరోనా టీకా సర్టిఫికెట్ల జోరు.. చెక్ పాయింట్ నివేదికలో వెల్లడి!

Elon Musk Space X: మరోచరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్..అంతరిక్షంలోకి సామాన్యులను చేర్చిన స్పేస్ ఎక్స్

Loading...
Unable to load recommendations.
Follow Us