మరోసారి పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో మరోసారి హవాలా ముఠా పట్టుబడింది. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ హవాలా కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారితో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదర్‌గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్‌కు చెందిన వీళ్లంతాహవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్నారని.. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు […]

మరోసారి పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదు స్వాధీనం
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 6:43 PM

హైదరాబాద్‌లో మరోసారి హవాలా ముఠా పట్టుబడింది. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ హవాలా కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారితో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదర్‌గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్‌కు చెందిన వీళ్లంతాహవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్నారని.. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ టాస్క్‌పోర్స్ రాధాకృష్ణ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేసిన బృందాన్ని సీపీ ఈ సందర్భంగా అభినందించారు.