బ్రేకింగ్: లలితా జ్యూవెలరీలో భారీ చోరీ.. గోడకు కన్నం వేసి..!

తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దోపిడీ జరిగింది. గాంధీనగర్‌లోని లలితా జ్యూవెలరీ దుకాణంలో కోట్ల విలువ చేసే నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనుక భాగంలో షెటర్లు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. తరువాత గోడకు కన్నం వేసి నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం మూడంతస్తుల భవనంలో.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొత్తం నగలు చోరీ చేశారు. కాగా, 50 […]

బ్రేకింగ్: లలితా జ్యూవెలరీలో భారీ చోరీ.. గోడకు కన్నం వేసి..!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 5:55 PM

తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దోపిడీ జరిగింది. గాంధీనగర్‌లోని లలితా జ్యూవెలరీ దుకాణంలో కోట్ల విలువ చేసే నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనుక భాగంలో షెటర్లు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. తరువాత గోడకు కన్నం వేసి నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం మూడంతస్తుల భవనంలో.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొత్తం నగలు చోరీ చేశారు. కాగా, 50 కిలోల బంగారం, విలువైన వజ్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ డ్రిల్ మిషన్ తో గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారు. పక్కా ప్లాన్‌తో ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు.