అసెంబ్లీలో సీటు మారిన వంశీ..అక్కడే సెటిల్ అవుతారా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాజధానులు అంశంతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతోన్న వంశీ తన సీటు మార్చుకున్నారు. మొన్నటివరకు ఆయన టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలో బ్యాక్ సైడ్ కూర్చున్నారు. తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేల పక్కన కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ పక్కన కూర్చోని.. ఆయనతో కాసేపు పిచ్చాపాటి ముచ్చటించారు. శాసనసభ ప్రత్యేక సమావేశాల రెండో రోజే వంశీ సీటు మారడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఇటీవలే జగన్‌ను కలిసిన […]

అసెంబ్లీలో సీటు మారిన వంశీ..అక్కడే సెటిల్ అవుతారా..?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 21, 2020 | 3:51 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాజధానులు అంశంతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతోన్న వంశీ తన సీటు మార్చుకున్నారు. మొన్నటివరకు ఆయన టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలో బ్యాక్ సైడ్ కూర్చున్నారు. తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేల పక్కన కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ పక్కన కూర్చోని.. ఆయనతో కాసేపు పిచ్చాపాటి ముచ్చటించారు. శాసనసభ ప్రత్యేక సమావేశాల రెండో రోజే వంశీ సీటు మారడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఇటీవలే జగన్‌ను కలిసిన మరో టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం నిన్న వల్లభనేని వంశీ పక్కనే కూర్చొన్నారు. మరి ఆయన్ను కూడా ప్రత్యేక సభ్యుడిగా కొనసాగిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా వంశీ కేవలం కొద్ది సమయం మాత్రమే అక్కడ స్పెండ్ చేశారా, లేకపోతే పర్మనెంట్‌గా అక్కడే సెటిలవుతారో తెలియాల్సి ఉంది.