ఇండియా అండర్-19 మాజీ క్రికెటర్ ఆత్మహత్య
రాహుల్ ద్రవిడ్ సహచర అండర్-19 క్రికెటర్ సురేశ్ కుమార్(47) సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అలప్పుజలోని తన ఇంట్లో సీలింగ్కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
రాహుల్ ద్రవిడ్ సహచర అండర్-19 క్రికెటర్ సురేశ్ కుమార్(47) సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అలప్పుజలోని తన ఇంట్లో సీలింగ్కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని కుమారుడు తొలుత గుర్తించారని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సురేశ్ కుమార్ (47) అండర్-19 క్రికెట్లో రాహుల్ ద్రవిడ్తో కలిసి భారత్ తరఫున ఆడారు. కేరళకు చెందిన సురేశ్ కుమార్.. 1991-06 మధ్య కాలంలో 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. 1657 పరుగులు చేయడంతో పాటు 196 వికెట్లు తీశారు. కేరళ తరఫున 52 రంజీ మ్యాచ్లు, రైల్వేస్ తరఫున 17 మ్యాచ్లు ఆడారు. సౌత్ జోన్, సెంట్రల్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలోనూ ప్రాతినిధ్యం వహించారు. 1992లో ద్రావిడ్ నాయకత్వంలోని భారత్ అండర్-19 వన్డే, టెస్టు జట్లకు ఆడారు. సురేశ్ బలవన్మరణం పట్ల అతడితో కలసి క్రికెట్ ఆడిన వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ( ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు )