జగన్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం మామ సంచలన ఆరోపణలు..!

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల  చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం మామ సంచలన ఆరోపణలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 3:18 PM

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల  చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని ఆయన అన్నారు. అర్హత ఉన్నా వైసీపీకి అనుకూలంగా లేకపోతే పింఛన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.  అవకాశం ఉన్నా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదని విమర్శించారు. రోడ్డ సదుపాయం, తాగునీటి సరఫరా, అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడంలో స్థానిక నాయకులు విఫలం అయ్యారని ఆయన మండిపడ్డారు.  2019 తరువాత నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో పిడుగు పడి చనిపోయిన బాధితుల కుటుంబాలకు యాభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రశేఖర్ రాజు డిమాండ్ చేశారు.

Read This Story Also: జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..!