పాక్పై అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ఆగ్రహం
పారిస్: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఖండించింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాక్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు నాటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సదరు కార్యాచరణలోని లక్ష్యాలను చేరుకోకపోతే ఆ దేశాన్ని గ్రే లిస్ట్లోనే కొనసాగించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం పారిస్లో సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్లో పాక్ను గ్రే లిస్ట్ జాబితాలోకి చేరుస్తున్నట్లు ఎఫ్ఏటీఎఫ్ […]
పారిస్: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఖండించింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాక్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు నాటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సదరు కార్యాచరణలోని లక్ష్యాలను చేరుకోకపోతే ఆ దేశాన్ని గ్రే లిస్ట్లోనే కొనసాగించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.
శుక్రవారం పారిస్లో సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్లో పాక్ను గ్రే లిస్ట్ జాబితాలోకి చేరుస్తున్నట్లు ఎఫ్ఏటీఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 2019 వరకు ఈ జాబితాలో పాక్ ఉండనుంది. పాక్ను ఈ జాబితాలో కొనసాగించాలా వద్దా అనే దానిపై చర్చించేందుకు ఎఫ్ఏటీఎఫ్ బృందం సమావేశమైంది. అక్రమ నగదు చలామణీ, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని దేశాలను ఈ గ్రే లిస్ట్లో పెడతారు.