KBC 12: 40వేల ప్రశ్నకు అన్ని లైఫ్‌ లైన్లు వాడేశాడు.. ఇంతకు క్వశ్చన్ ఏంటంటే

| Edited By:

Oct 28, 2020 | 4:52 PM

అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరించే కౌన్‌ బనేగా క్రోర్‌పతి షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని ప్రశ్నలను సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి నగదు బహుమతులు అందిస్తుంటారు.

KBC 12: 40వేల ప్రశ్నకు అన్ని లైఫ్‌ లైన్లు వాడేశాడు.. ఇంతకు క్వశ్చన్ ఏంటంటే
Follow us on

Kaun Banega Crorepati 12: అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరించే కౌన్‌ బనేగా క్రోర్‌పతి షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని ప్రశ్నలను సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి నగదు బహుమతులు అందిస్తుంటారు. హిందీలో ఈ షో ఇప్పుడు 12వ సీజన్‌ని జరుపుకుంటోంది. ఇక ఈ సీజన్‌లో ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన కోశ్లేంద్ర సింగ్ తోమర్‌ అనే వ్యక్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 40వేల క్వశ్చన్‌గా కోశ్లేంద్రను అమితాబ్‌ ఓ ప్రశ్న అడిగారు. సమ్మర్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌ సొంతం చేసుకున్న ఒకే ఒక భారతీయ మహిళ ఎవరు..? అని ప్రశ్నించారు. దానికి పీవీ సింధు, మేరీ కోమ్‌, మల్లీశ్వరి, సాక్షి మాలిక్ అన్న ఆప్షన్‌లను ఇచ్చారు. దానికి పీవీ సింధు కరెక్ట్ ఆన్సర్ కాగా.. తోమర్ మొదటగా వీడియో ఎ ఫ్రెండ్‌ అనే ఆప్షన్‌ని ఉపయోగించుకున్నారు. అయితే ఫ్రెండ్‌ చెప్పిన సమాధానంతో తృప్తి చెందని కోశ్లేంద్ర 50-50 లైఫ్‌ లైన్‌ని ఉపయోగించుకున్నారు. అందులో పీవీ సింధు, కరణం మల్లీశ్వరి ఉండగా.. ఫైనల్‌గా ఎక్స్‌పర్ట్ లైఫ్‌టైమ్‌ని వాడుకున్నారు. మొత్తానికి ఈ ప్రశ్న నుంచి బయట పడ్డాడు. అయితే ఆ తరువాత క్వశ్చన్‌కి కూడా కోశ్లేంద్ర స్టక్‌ అవ్వగా.. లైఫ్ లైన్లు లేకపోవడంతో షో నుంచి క్విట్‌ అయ్యాడు.(‘మన్నత్‌’ని అమ్మేస్తున్నారా.. కింగ్‌ఖాన్ రిప్లై అదుర్స్‌)

ఇక ఈ ఎపిసోడ్‌లో మధ్యలో కోశ్లేంద్ర మాట్లాడుతూ.. తాను గెలుచుకున్న డబ్బుతో తన భార్యకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తానని అన్నారు. వెంటనే అమితాబ్‌.. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు అని ప్రశ్నించగా.. 15 ఏళ్లుగా అదే మొహం చూడలేకపోతున్నాను సర్ అని చెప్పారు. అమితాబ్‌ సీరియస్ అయ్యారు. నువ్వు ఇతడి మాటల వినకమ్మా అంటూ కోశ్లేంద్ర భార్యకు సూచించారు. ప్లాస్టిక్ సర్జరీ మంచిది కాదని ఆయన షో వీక్షకులకు కూడా హెచ్చరించారు.(కరోనా అని తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యా: నాగబాబు)