‘దొరసాని’ ఎప్పుడొస్తుందంటే?

|

May 22, 2019 | 12:42 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే […]

‘దొరసాని’ ఎప్పుడొస్తుందంటే?
Follow us on

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు. క్రేజీ జోడీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.