కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. జీవితాలన్నీ తారుమారయ్యారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోంది. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ మహారాష్ట్రలోని తన ఫాంహౌస్లోనే ఉంటున్నాడు. అక్కడే వ్వవసాయం చేస్తూ ఈ బిజీ లైఫ్ నుంచి స్వాంతన పొందుతున్నారు. తాజాగా తన పొలంలో పని చేస్తూ శరీరమంతా మట్టిని పులుముకుని కనిపించాడీ సీనియర్ హీరో. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ..‘రెస్పెక్ట్ టూ ఆల్ ద పార్మర్స్’ అని రాసుకొచ్చాడు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రారంభమైనప్పటి నుంచి సల్మాన్ ఆ వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతున్నారు.
సల్మాన్ చివరిగా ‘దబాంగ్ 3’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ‘రాధే’ సినిమాలో నటిస్తున్నాడు. కానీ కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇందులో సల్మాన్ పక్కన దిశా పటానీ నటించనుంది.