Sai Pallavi: కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.. ‘షీలా కీ జవానీ’ పాటతో రచ్చ చేసిన న్యాచురల్ బ్యూటీ..

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు మారుమోగుతుంది. అందుకు కారణం కాలేజీ రోజుల్లో ఆమె చేసిన డాన్స్ వీడియో బయటకు రావడమే. కాలేజీ ఫెస్ట్‏లో బాలీవుడ్ పాటకు మాస్ డ్యాన్స్ తో ఇరగదీసింది.. అప్పట్లో సాయి పల్లవి విదేశాల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాలేజీలో సాయి పల్లవి చేసిన డాన్స్ వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. కానీ ఇప్పుడు మరో వీడియో చక్కర్లు కొడుతుంది

Sai Pallavi: కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.. 'షీలా కీ జవానీ' పాటతో రచ్చ చేసిన న్యాచురల్ బ్యూటీ..
Sai Pallavi
Follow us

|

Updated on: Apr 16, 2024 | 5:37 PM

సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత ముఖ్యమంటూ తనకంటూ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది. లవ్ స్టోరీ తర్వాత మరోసారి ఈ హిట్ పెయిర్ జతకట్టడంతో తండేల్ చిత్రంపై క్యూరియాసిటీ నెలకొంది. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చైతూ, సాయి పల్లవి ఇద్దరూ ఢీ గ్లామర్ లుక్‏లో కనిపించనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు మారుమోగుతుంది. అందుకు కారణం కాలేజీ రోజుల్లో ఆమె చేసిన డాన్స్ వీడియో బయటకు రావడమే. కాలేజీ ఫెస్ట్‏లో బాలీవుడ్ పాటకు మాస్ డ్యాన్స్ తో ఇరగదీసింది.. అప్పట్లో సాయి పల్లవి విదేశాల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాలేజీలో సాయి పల్లవి చేసిన డాన్స్ వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. కానీ ఇప్పుడు మరో వీడియో చక్కర్లు కొడుతుంది.

కాలేజీ ఫెస్ట్‏లో తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సూపర్ హిట్ సాంగ్ షీలా కీ జవానీ పాటకు డాన్స్ అదరగొట్టింది సాయి పల్లవి. ఇక ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ లెవల్స్ తో వేసిన స్టెప్పులతో తన పక్కనున్నవారిని డామినేట్ చేసింది. వీడియో దూరం నుంచి తీయడంతో అందరూ బ్లర్ గా కనిపిస్తున్నారు. కానీ బాలీవుడ్ పాటకు తన డాన్స్ తో అబ్బురపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. లేడీ మైఖెల్ జాక్సన్.. న్యాచురల్ బ్యూటీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో సాయి పల్లవి డాన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ నటిస్తోన్న మరో కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు అమీర్ ఖాన్ జోడిగా కనిపించనుంది. హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణం మూవీలో నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. అలాగే రావణుడిగా యష్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.