Telangana BJP: డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం.. మోదీ సహా అగ్రనేతలతో సభలు, రోడ్‌ షోలకు ప్లాన్

తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్‌షా టూర్‌... తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో అయితే అమిత్‌షా రోడ్‌షో ఒక రేంజ్‌లో సాగింది. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్‌ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది.

Telangana BJP: డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం.. మోదీ సహా అగ్రనేతలతో సభలు, రోడ్‌ షోలకు ప్లాన్
Modi Yogi Amit Shah
Follow us

|

Updated on: May 02, 2024 | 8:57 AM

తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్‌షా టూర్‌… తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో అయితే అమిత్‌షా రోడ్‌షో ఒక రేంజ్‌లో సాగింది. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్‌ ఎంపీ సీటును సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది. పాతబస్తీలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారంతో పొలిటికల్‌ హీట్ మరింత పీక్స్‌కు చేరనుంది.

రోడ్‌షో తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు అమిత్‌షా. దాదాపు గంటపాటు ఈ సమావేశాలు జరిగాయి. ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరగబోతోందని, కచ్చితంగా 12 స్థానాలు గెలవబోతున్నట్టు అమిత్ షా చెప్పారు. కొంచెం కష్టపడితే మరో రెండు సీట్లు కూడా సాధించవచ్చన్నారు అమిత్‌షా. మరో రెండుసార్లు తెలంగాణకు రానున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారు అమిత్‌షా. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నట్లు అమిత్ షా తెలిపారు. రెండు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. మే 8న వరంగల్‌, కరీంనగర్‌లో, అలాగే మే 10వ తేదీన మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

ఇక, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా కన్వీనర్లకు కీలక సూచనలు చేశారు అమిత్‌షా. బీజేపీకి మంచి వాతావరణం ఉందని, బూత్‌స్థాయిలో కష్టపడితే 12నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ప్రతి ఓటరును కలిసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు అమిత్‌షా.

తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే నామినేషన్‌ కోసం బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా.. నాలుగో దశలో మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు