Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్(Prabhas)దాదాపు రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతినిండా సినిమాలతో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు. చకచకా సినిమాలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెబల్ స్టార్. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పృథి చేశాడు ప్రభాస్. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకి సంబంధించిన పాటలను.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను వేరు.. వేరు సంగీత దర్శకులతో చేయిస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి ఓ ఆసక్తికర వార్త ఇపుడు ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. హిందీ వెర్షన్కి సంబంధించిన రన్ టైమ్ 2:30 గంటలు ఉంటుందట. ఈ రన్ టైమ్ను లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. ప్రిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్లో తేడా ఉండనుందట. హిందీ కంటే తెలుగులో రన్ టైమ్ తక్కువ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :