Actress Nayanthara: వెంకన్న సన్నిధిలో నాయనతార దంపతులు.
Nayanathara

Actress Nayanthara: వెంకన్న సన్నిధిలో నాయనతార దంపతులు.

Edited By:

Updated on: Apr 11, 2026 | 4:59 PM

నయనతార దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సొంత బ్యానర్ పై నిర్మించిన లైక్ మూవీ విడుదల సందర్బంగా తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్. బయటకు వచ్చిన నయనతార, విగ్నేష్ లు భక్తులతో ముచ్చటించారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ నయనతార.భర్త విగ్నేష్ శివన్ కలిసి తో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సొంత బ్యానర్ పై నిర్మించిన లైక్ మూవీ విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు నయనతార దంపతులు తిరుమలలు వచ్చారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్ లకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన నయనతార, విగ్నేష్ లు భక్తులతో ముచ్చటించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించిన వారితో ఫోటోలు దిగారు.

Published on: Apr 11, 2026 04:56 PM
Follow Us