యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరుగుతోంది. ఇందుకోసం ఫిలింసిటీలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. దాదాపు లక్ష మంది అక్కడ కూర్చొనేందుకు వీలుగా అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సాహో యూనిట్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.