తానెప్పుడూ ప్రాక్టికల్గానే ఉంటానని ప్రజెంట్లోనే జీవిస్తానని చెబుతున్న అలనాటి బాలీవుడ్ హీరోయిన్..
‘సంతోషం, తప్పు చేసి పప్పు కూడు’ చిత్రాల ద్వారా ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ అందరికి గుర్తుండే
‘సంతోషం, తప్పు చేసి పప్పు కూడు’ చిత్రాల ద్వారా ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె సినిమాలకు దూరమై చాలా రోజులు గడుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పనికోసం మేకర్స్ను ఎప్పుడూ కూడా సంప్రదించలేదన్న గ్రేసీ సింగ్ తన మేనేజర్ జోషి జీ ఉన్నప్పుడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నించేవాడని తెలిపింది.
హిందీలో ‘లగాన్, మున్నాభాయ్ ఎంబిబిఎస్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించిన ఆమె సినీ పరిశ్రమలో ఎదగాలని అనుకోలేదా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తనకు ఎప్పుడు అలాంటి ఆశయాలు లేవని, మనకు ఒక పనిపై కొన్ని అంచనాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సమస్య తలెత్తుతుందని తన అభిప్రాయాన్ని వివరించింది. తానెప్పుడూ ప్రాక్టికల్గా ఉంటానని ప్రజెంట్లోనే జీవిస్తానని తెలిపింది. ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పడే ఎక్కువ సినిమాలు చేయనని చేసే సినిమాలు కూడా కుటుంబంతో చూడగలిగేవి, సాధారణ అమ్మాయి మాదిరి పాత్రలు అయి ఉండాలని మేనేజర్కు చెప్పానని వెల్లడించింది. 2008లో ఆయన చనిపోయిన తర్వాత తను ఎవరిని కాంటాక్ట్ చేయలేదని చెప్పింది. నటించడం ఒక్కటే తన జీవిత లక్ష్యం కాదని బదులిచ్చింది గ్రేసీ సింగ్. సంతృప్తిని కలిగించే మరేదైనా పని చేయాలనుకుంటున్నానని తెలియజేసింది.