Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏కు బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు పంపిన పోలీసులు..

మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ పై ప్రస్తుతం 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో సుకేష్ ప్రమేయం గురించి జాక్వెలిన్‏కు ముందుగానే తెలుసునని..

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏కు బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు పంపిన పోలీసులు..
Jacqueline Fernandez

Updated on: Sep 13, 2022 | 9:40 AM

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏పై (Jacqueline Fernandez) విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు. రూ. 200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో హీరోయిన్ ప్రేమలో ఉందని.. అతడి నుంచి భారీ మొత్తంలో కానుకలు వచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది జాక్వెలిన్. ఈ క్రమంలోనే సుకేష్ చంద్రశేఖర్ పై ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు సెప్టెంబర్ 14న హాజరు కావాలంటూ ఢిల్లీ పోలీసులు ఆమెకు నోటీసుపు జారీ చేశారు. వాస్తవానికి జాక్వెలిన్‏ను సెప్టెంబర్ 12న విచారించాల్సి ఉంది. కానీ ముందుస్తు కట్టుబాట్లతో మందిర్ మార్గ్‏లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ హెడ్ క్వార్టర్స్‏కు తాను విచారణకు రాలేనని జాక్వెలిన్ కోరగా.. ఆమెకు సెప్టెంబర్ 14న హాజరుకావాలని సమన్లు జారీ చేశారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ పై ప్రస్తుతం 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో సుకేష్ ప్రమేయం గురించి జాక్వెలిన్‏కు ముందుగానే తెలుసునని.. కానీ అవేం పట్టించుకోకుండా అతనితో ఆర్థిక లావాదేవిల్లో పాల్గోన్నదని ఈడీ ధాఖలు చేసిన ఛార్జిషీట్‏లో పేర్కొంది. 2021 ఆగస్టు 30, అక్టోబరు 20న ఫెర్నాండెజ్ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశామని, అక్కడ చంద్రశేఖర్ నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించిందని ఈడీ గతంలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఆదాయాన్ని ఇండియాతోపాటు విదేశాల్లోనూ తనకు తన కుటుంబసభ్యుల కోసం ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us