డిగ్రీ కాలేజీ సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సిలింగ్
డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ అధికారులు తెలిపారు.
డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వరకు విద్యార్థల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నారు. పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి, 27న సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. అందులో సీట్లు రాని విద్యార్థులకు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నది. వచ్చే నెల 1 నాటికి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. మూడో విడుతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈరోజు సీట్లు కేటాయించనున్నారు.