శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!

| Edited By:

Jan 26, 2020 | 2:44 PM

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు […]

శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!
Follow us on

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో ఆమె కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.