Murder: మహిళపై అత్యాచారం..గొంతుకోసి దారుణంగా హత్య.. ఆపై డ్రైనేజీలో..
Woman raped in Mumbai: నిర్భయ లాంటి కేసులు ఎన్ని నమోదవుతున్నా.. మృగాళ్ల పైశాచికత్వం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు
Woman raped in Mumbai: నిర్భయ లాంటి కేసులు ఎన్ని నమోదవుతున్నా.. మృగాళ్ల పైశాచికత్వం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కామాంధుల చేతిలో మహిళల బతుకులు బలవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ర్ట రాజధాని ముంబైలో జరిగింది. అంతేకాకుండా ఆ మహిళ మతదేహాన్ని బాంద్ర కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజీలో పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి ప్రైవేటు భాగాల్లో కూడా గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె వృత్తిరీత్యా వ్యభిచారి అని తెలిసిందన్నారు. అయితే.. విటులకు, ఆమెకు మధ్య డబ్బుల విషయంలోనే గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ణయానికి వచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై 376 (అత్యాచారం), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు.
Also Read: