కన్న కూతురిపై కన్నేసిన వార్డ్ మెంబర్.. గొడ్డలితో హతమార్చిన కొడుకు

| Edited By:

May 14, 2020 | 3:35 PM

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ గ్రామపంచాయితీ వార్డు సభ్యుడు.. కన్న కూతురిపైనే కన్నేశాడు. తన కోరికలను తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ ఘటన జిల్లాలోని భిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలయ్య అనే వ్యక్తి వార్డ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా సొంత కూతురిపై మైలయ్య వేధింపులకు దిగుతున్నాడు. తన కామ కోరికలను తీర్చాలంటూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో సదరు బాధితురాలు విషయాన్ని తల్లికి, సోదరుడికి తెలిపింది. దీంతో […]

కన్న కూతురిపై కన్నేసిన వార్డ్ మెంబర్.. గొడ్డలితో హతమార్చిన కొడుకు
Follow us on

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ గ్రామపంచాయితీ వార్డు సభ్యుడు.. కన్న కూతురిపైనే కన్నేశాడు. తన కోరికలను తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ ఘటన జిల్లాలోని భిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలయ్య అనే వ్యక్తి వార్డ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా సొంత కూతురిపై మైలయ్య వేధింపులకు దిగుతున్నాడు. తన కామ కోరికలను తీర్చాలంటూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో సదరు బాధితురాలు విషయాన్ని తల్లికి, సోదరుడికి తెలిపింది. దీంతో చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న ఆగ్రహంతో.. గొడ్డలితో తండ్రి మైలయ్యను హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.