ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ..ఒకరు మృతి

అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి...

ఆస్తి కోసం అన్నదమ్ముల ఘర్షణ..ఒకరు మృతి

Updated on: Jul 17, 2020 | 9:56 AM

అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తోబుట్టువు అని కూడా చూడకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నం మాజీ సర్పంచ్‌, అతడి సోదరుడికి మధ్య గత కొంతకాలంగా పొలం విషయంలో వివాదం కొనసాగుతోంది. వారికి గ 70 సెంట్ల పొలం పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఇటీవలే ఈ వివాదం మరింత ముదిరి ఒకరినొకరు పరస్పరం దూషించున్నారు. ఈ ఘర్షణలో అన్నాదమ్ములిద్దరూ కర్రలతో దాడి చేసుకున్నారు. దాడిలో మాజీ సర్పంచ్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us