Nellore: నెల్లూరులో గుడిసెలు తగులపెట్టిన దుండగులు.. బాధితుల ఆక్రందనలు.. అనేక అనుమానాలు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో దారుణం జరిగిపోయింది. రాత్రికి రాత్రి నిరాశ్రయులయ్యారు నిరుపేదలు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితులు- రియల్
Nellore Huts Fire: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో దారుణం జరిగిపోయింది. రాత్రికి రాత్రి నిరాశ్రయులయ్యారు నిరుపేదలు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితులు- రియల్ ఎస్టేట్ వ్యాపారుల వివాదం నెలకొనగా, రాత్రికి రాత్రి గుడిసెలు తగులబడ్డం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు సమాచారం. మరోవైపు, బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఫలితంగా గుడిసెలు తగులబడ్డ నెల్లూరు రూరల్ పరిధిలోని నక్కా గోపాల్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తగలబడిన గుడిసెలన్నీ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవే.
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలపై అకృత్యానికి పాల్పడ్డ ఆగంతకుల అంతు చూసేవరకూ ఊరుకునేది లేదని బాధితులు శపథం చేస్తున్నారు. దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.