వరంగల్లో సంచలనం రేపిన తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో హంతకుడు ప్రవీణ్కు ఉరిశిక్ష పడటం పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పసిపాపను అత్యాచారం చేసి చంపిన ప్రవీణ్ కు విధించిన ఈ మరణ శిక్ష ముమ్మాటికి సరైన తీర్పు అన్నారు. ఇలాంటి కామంధులు చెలరేగకుండా కఠిన చట్టాలు అవసరమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ కేసులో 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు.. 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. ప్రవీణ్ నేరం చేసినట్లు నిర్ధారిస్తూ అతడికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఘటనపై తీర్పు ఇంతత్వరగా రావడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
Sir, there are certain things that shouldn’t be pardoned by civil society. This animal raped a 9 month child; can it get more heinous??
He absolutely deserves death & just the thought of rape should send a chill down the spine of such psychopaths#JusticePrevails https://t.co/Jq6i4zfC1U
— KTR (@KTRTRS) August 8, 2019