బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

| Edited By:

Jul 19, 2020 | 10:16 AM

ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సును మరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..

బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Follow us on

ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సును వెనుక నుంచి మరో వాహనం ఢీ కొంది. దీంతో అదుపు తప్పిన బస్సు.. డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు బీహార్ దర్భంగా నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More: 

దేశంలో కరోనా విలయం.. రికార్డు స్థాయిలో కొత్తగా 38,902 కేసులు..