AP Crime News : కాపాడాలని వేడుకుంటే కడతేర్చాడు.. సొంత భార్యనే ఉరేసి చంపిన అనుమానపు భర్త..

AP Crime News : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి అనుమానం పెంచుకున్నాడు. ఇతరులు వేధిస్తున్నారని

AP Crime News : కాపాడాలని వేడుకుంటే కడతేర్చాడు.. సొంత భార్యనే ఉరేసి చంపిన అనుమానపు  భర్త..

Updated on: Mar 05, 2021 | 10:11 PM

AP Crime News : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి అనుమానం పెంచుకున్నాడు. ఇతరులు వేధిస్తున్నారని వారి బారి నుంచి కాపాడాలని భర్తను వేడుకుంటే వారితో ఏదో సంబంధం ఉందని అనుమానించి భర్తే కడతేర్చాడు. హత్య నుంచి తప్పించుకునేందుకు వేరొకరిపై నేరం మోపి వారిపై దాడికి వెళ్లాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మహీధర్‌(6), బాబి(4) అనే ఇద్దరు సంతానం.

అయితే స్థానికంగా ఉండే టీచర్ గోపీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ భానుప్రియను వేధింపులకు గురి చేసేవారు. దీంతో అనుమానం పెంచుకున్న భర్త నారాయణమూర్తి ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. వేధింపులపై 3రోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్‌ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టేశాడు. పోలీసులు నారాయణ మూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టైంది. దీంతో నిందితుడు నారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్‌ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపైనా మరో కేసు నమోదు చేశారు.

కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నారా..! అయితే మీ పని అయిపోయినట్టే..? ఒక్కసారి మీ లివర్ పనితీరును పరిశీలించుకోండి..

Guardians App : ఇక నుంచి మీ పిల్లల సేఫ్టీ మీ అరచేతిలోనే.. సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టిన ట్రూకాలర్..

Loading...
Unable to load recommendations.
Follow Us