ఏపీని వెంటాడుతున్న కరోనా..కొత్తగా 138 కేసులు..రెండు మరణాలు
ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. నేడు కొత్తగా 138 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో...
ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. నేడు కొత్తగా 138 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాలకు చెందిన వారు 50మంది, వలస కూలీలు 84మంది కి, ఎన్ఆర్ఐలు నలుగురికి కరోనా సోకింది.. దీంతో ఇప్పటి వరకు ఎపీలో నమోదైన కేసుల సంఖ్య 4250 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాలలో 3427కేసులు, విదేశాల నుంచి వచ్చిన 123 కేసులు, వలస కూలీలకు చెందిన 700 కేసులున్నాయి.. కరోనాతో కృష్ణా లో ఇద్దరు మరణించారు.. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 73మంది మరణించారు. ఇప్పటివరకు 2వేల 294 మంది వివిధ జిల్లాలోనూ, వలస కూలీలు 258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు..ప్రస్తుతం రాష్ట్రంలో 1060యాక్టివ్ కేసులు ఉండగా, విదేశాల నుంచి వచ్చిన 119మంది, వలస కూలీలు 442 మంది వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.